Friday, April 26, 2024

కూకట్‌పల్లిలో కంపించిన భూమి.. పరుగులు తీసిన జనం

- Advertisement -
- Advertisement -

Earthquake in Kukatpally Asbestos colony

హైదరాబాద్: నగరంలో స్వల్పంగా భూమి కంపించింది. కూకట్ పల్లిలోని అస్బెస్టాల్ కాలనీలో రెండు సార్లు భారీ భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో భయాందోళనకు గురైన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పెద్ద శబ్ధంతో భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు. కాగా, ఇప్పటి వరకు పెద్దగా ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. గతంలో గచ్చిబౌలి, బోరబండ ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. ఇటీవల కాలంలో తరుచూ హైదరాబాద్‌లో భూమి కంపిస్తోంది. అక్టోబర్‌లో కూడా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News