Saturday, May 4, 2024

మంత్రి వర్గం నుంచి ఈటల బర్తరఫ్

- Advertisement -
- Advertisement -

Eatala Rajender dropped from Cabinet

ఈటల అసైన్‌మెంట్ భూమిని కబ్జా చేసినట్లు కలెక్టర్ నివేదిక

నివేదిక ఆధారంగా మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ సిఎం నిర్ణయం

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి వర్గం నుంచి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఆదివారం సాయంత్రం ఫైల్‌ను పంపించారు. అసైన్‌మెంట్ భూమి కబ్జా వ్యవహారంలోనే ఈటలను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేస్తున్నట్లు ఫైల్‌లో నివేదించారు. ఈటల భూ కబ్జా వ్యవహారంలో మెదక్ కలెక్టర్ హరీష్ సిఎస్‌కు సమర్పించిన సమర్పిచారు. 66.1 ఎకరాల అసైన్‌మెంట్ భూమిని ఈటల కబ్జా చేసినట్లు నివేదికలో వెల్లడించారు. కలెక్టర్ సమర్పించిన నివేదిక ఆధారంగా ఈటలను మంత్రి నుంచి బర్తరఫ్ చేసేందుకు సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకుని, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఫైల్‌ను పంపించగా, గవర్నర్ ఆమోదం తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News