Sunday, April 28, 2024

క్యాసినో చికోటి ప్రవీణ్ కు ఇడి నోటీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: క్యాసినో చికోటి ప్రవీణ్‌కు ఇడి మరోసారి నోటీసులు ఇచ్చింది. చికోటి ప్రవణ్‌తో పాటు దేవేందర్, మాధవ రెడ్డికి సైతం నోటీసులు ఇచ్చింది. చికోటి ప్రవీణ్ శుక్రవారం హైదరాబాద్‌కు రానున్నారు. వచ్చేవారం చికోటి ఇడి ముందుకు రానున్నారు. క్యాసినో కేసులో గతంలోనూ చికోటి ప్రవీణ్‌ను ఇడి విచారించింది. గతంలో 7 దేశాల్లో చికోటి క్యాసినో నిర్వహించినట్లు ఇడి అధికారులు గుర్తించారు. శ్రీలంక, ఇండోనేషియా, నేపాల్, సింగపూర్, థాయ్‌లాండ్‌లలో క్యాసినోలలో ఇప్పటివరకు వెయ్యిమందికిపైగా విదేశాలకు తీసుకెళ్లి క్యాసినో ఆడించినట్లు ఇడి గుర్తించింది. హవాలా మార్గంలో డబ్బులు తరలిస్తున్నట్లు వెల్లడించింది.

Also Read: రాహుల్ స్థానంలో ఇషాన్..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News