- Advertisement -
న్యూఢిల్లీ : కరోనా వ్యాధిబారిన పడిన ఎనభై ఏళ్ల వయసున్న దంపతులు ఒక ఆస్పత్రిలో ఒకరికొకరు గుడ్ బై చెప్పుకునే వీడియో చూసిన వారిని కలచి వేస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక ట్విటర్ యూజర్ ఆ వృద్ధ దంపతుల వీడియోను షేర్ చేశారు. ‘దంపతులంటే అర్థమేమిటి? కరోనా వ్యాధికి గురైన ఇద్దరు వృద్ధ రోగులు ఒకరికొకరు ఐసియులో గుడ్బై చెప్పుకొంటున్నారు. మనం కలుసుకోవడం, గ్రీట్ చేసుకోవడం ఇదే చివరిసారి కావచ్చు’ అని ఆ వృద్ధులు చెబుతున్నట్టు వీడియోతో పాటు ఒక క్యాప్షన్ కూడా ంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు భావోద్వేగంతో స్పందించారు. ఈ వృద్ధుల బాధ హృదయాన్ని కలచివేస్తోంది’ అని నెటిజన్లు బాధపడుతున్నారు.
Elderly couple with coronavirus says goodbye
- Advertisement -