Saturday, April 27, 2024

ఓల్డ్ సిటీలో రూ.1,404.58 కోట్లతో విద్యుత్ నిర్మాణ పనులు : జగదీష్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఓల్డ్ సిటీలో రూ.1,404.58 కోట్ల వ్యయంతో ట్రాన్స్‌కో, టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ ఆధ్వర్యంలో విద్యుత్ నిర్మాణాలు చేపట్టినట్లు విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే రూ.1,330.94 కోట్ల పనులు పూర్వవ్వగా, మరో రూ.73.64 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. శుక్రవారం శాసనమండలిలో ఎంఐఎంకు పార్టీకి చెందిన ఎంఎల్‌సిలు మీర్జా రియాజల్ హసన్, మీర్జా రహమత్ బేగ్‌లు అడిగిన ప్రశ్నకు మంత్రి జగదీష్ రెడ్డి సమాధానమిచ్చారు. అలాగే రూ.1,404.58 కోట్ల ట్రాన్స్మిషన్‌కు గాను ట్రాన్స్‌కో నుంచి 957.29 కోట్లు వెచ్చించగా, టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ రూ.447.29 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన సభకు వివరించారు.

గడిచిన తొమ్మి దేళ్ల వ్యవధిలోనే ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేసి విద్యుత్ ప్రసారాలను క్రమబద్దీకరించినట్లు పేర్కొన్నారు. నాలుగు 220 కెవి సబ్ స్టేషన్లు, 132 కెవి సబ్ స్టేషన్లు రెండు, 33/11 కెవి సబ్ స్టేషన్లు 15,256 కిలోమీటర్ల 33 కెవి లైన్ తో పాటు 63 ఆదనవు ట్రాన్స్‌ఫార్మర్స్‌ను ఏర్పాటు చేశామ న్నారు. 16 ట్రాన్స్ఫార్మర్స్ సామర్ధ్యాన్ని పెంచడంతో పాటు 565 కిలోమీటర్ల 11 కెవి లైన్‌ను వేసినట్లు చెప్పారు. ఓల్డ్ సిటీకి చెందిన శాసనసభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించి, వారి వారి అభ్యర్థన మేరకే ఈ నిర్మాణాలు జరిగాయన్నారు. సబ్ స్టేషన్ల నిర్మాణాల విషయంలో స్థలానికి సంబంధించిన అంశాలు ఆటంకాలు ఎదురైనప్పటికి స్థానిక శాసనసభ్యుల ప్రమేయంతో పరిష్కరించినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలకు అష్కారమే లేదని తేల్చిచెప్పారు. విపత్తు సమయంలోనూ విద్యుత్ ప్రసారాలలో అంతరాయం కలుగ కుండా చేసిన ఘనత తెలంగాణ విద్యుత్ సంస్థల యజమాన్యాలదని, అందులో పని చేసే సిబ్బందిదని ఆయన కొనియాడారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News