Saturday, April 27, 2024

పంచాయతీరాజ్‌శాఖకు కొత్త జవసత్వాలు

- Advertisement -
- Advertisement -

ఇంజినీరింగ్ విభాగం పునర్వవస్థీకరణ కొత్తగా 87 ఇంజినీరింగ్
కార్యాలయాల మంజూరు అన్నిస్థాయిల్లో అదనంగా 740పోస్టులు

మనతెలంగాణ/ హైదరాబాద్ : పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం పునర్వవస్థీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా 4 చీఫ్ ఇంజినీర్, 12 సర్కిల్ ఇంజినీర్, 11 డివిజన్ ఇంజినీర్, 60 సబ్ డివిజన్ ఇంజినీర్ పోస్టులను మంజూరు చేసింది. పంచాయత్ రాజ్ శాఖలోని ఇంజినీరింగ్ విభాగం మ రింత సమర్థవంతంగా పనులను చేపట్టేందుకు వీ లుగాపునర్వవస్థీకరించారు. పునర్వ్యవస్థీకరణ లో కొత్త గా 87 కార్యాలయాల మం జూరు కావడంతో పాలన మెరుగుపడనున్నది. ఆరు నెలలుగా జరుగుతున్న కసరత్తుకు మంగళవారం జారీ చేసిన జీవోతో కొలిక్కి వచ్చినట్లయింది.

ఈ మేరకు పిఆర్, ఆర్‌డి ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా జీవో 18 విడుదల చేశారు. ఆయా హోదాల్లో ఉన్న ఇంజినీర్లకు అధికారాల బదలాయింపు సైతం చేశారు. ఇందుకు మరో జీవో నెంబరు 19 జారీ చేశారు. రాష్ట్ర విద్యుత్, ఆర్‌అండ్‌బి, సాగునీటి పారుదల శాఖ తరహాలోనే పం చాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖను బలోపేతం చే యాలని ముఖ్యమంత్రి కెసిఆర్ భావించారు. ఈ మేరకు ప్రతిపాదనలను పంపాలని గతేడాది నవంబరులో ఇంజినీర్ ఇన్ చీఫ్ ఏజ్ సంజీవరావును ఆ దేశించారు. దీంతో ఈఎన్సీ తన శాఖలో పని, ప్ర స్తుతం ఉన్న పోస్టులు, అదనపు కావాల్సిన పోస్టులతో సమగ్రంగా నివేదిక  పంపారు. దీనిని మంత్రివర్గ సమావేశంలో చర్చించి కొన్ని మార్పులతో పున: ప్రతిపాదనలు పంపాలని సూచించారు.

ఈ బాధ్యతను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, పంచాయతీరాజ్ శాఖ ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అప్పగించారు. ఆయా దశలు, స్థాయిల్లో సంప్రదింపులు అనంతరం పంపిన ప్రతిపాదలను తాజాగా చర్చించి ఆమోద ముద్రవేశారు. పూర్తిస్థాయిలో కసరత్తు చేసిన అనంతరం అన్ని స్థాయిల్లో కొత్తగా మరో 740 పోస్టులు ఆయా స్థాయిల్లో పెరిగే అవకాశం ఉంది . పాత పోస్టులు 2868 కలుపుకుని పిఆర్ ఇంజినీరింగ్ శాఖలో మొత్తం 3608 పోస్టులు రానున్నాయి. ఈ నేపథ్యంలో కిందిస్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో క్యాడర్‌లో భారీ మార్పులు రానున్నాయి.

ఇంజనీరింగ్ శాఖ పనితీరు మరింత మెరుగుపడనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన ప్రకారం కొత్తగా నాలుగు చీఫ్ ఇంజినీర్, 12 సర్కిల్ ఇంజినీర్ కార్యాలయాలు, 11 డివిజనల్ ఇంజినీర్ కార్యాలయాలు, 60 డివిజినల్ కార్యాలయాలు , ఇంజినీర్ పోస్టులను మంజూరు చేసింది. వివిధ స్థాయిల్లో ఇంజినీర్లకు పనులు మంజూరు చేసే అధికారం కల్పించింది. డిఈఈకి ఏడాదికి రూ. 5 లక్షలు, ఈఈకి ఏడాదికి రూ. 25 లక్షల వరకు అనుమతి ఇచ్చింది. ఎస్‌ఈకి రూ. కోటి, సిడి రూ .2.5 కోట్లు, ఈఎన్సీకి రూ . 5 కోట్ల వరకు పరిపాలన అనుమతులు ఇచ్చే అధికారం కల్పిస్తూ ఆదేశాలింది . దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పిఆర్ ఇంజినీరింగ్ శాఖలో సంబరాలు నిర్వహించారు.

ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కృతజ్ఞతలు : సంజీవరావు , ఈఎన్సీ
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖకు భారీగా పోస్టులు మంజూరు చేసినందుకుగాను ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఈఎన్సీ సంజీవరావు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ మరింత మెరుగ్గా నిర్వహించి ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు . మంగళవారం హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లోని పిఆర్ ఇంజినీరింగ్ శాఖ ప్రధాన కార్యాలయంలో ఇంజినీర్లు, ఉద్యోగులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంజీవరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పోస్టులు మంజూరయ్యాయని చెప్పారు.

ఈఎన్పీగా తాను ఉన్నప్పుడు శాఖను పూర్తిస్థాయిలో పునర్ వ్యవస్థీకరణ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇందు కు సహకరించిన మంత్రులు – హరీశ్‌రావు, దయాకర్‌రావు, సిఎస్ శాంతికుమారి, ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానీయా, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు, సిఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్‌కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఇంజినీర్లు ఉద్యోగులు టపాసులు పేల్చి.. మిఠాయిలు పంచారు. కార్యక్రమం లో సిఈ జి.సీతారాములు, ఎస్‌ఈలు ఎం.ఆశోక్, ఎం. సురేశ్వంద్రారెడ్డి, ఈఈ రమేశ్‌చందర్, వి. శ్రీహరి, ముజీబ్ , అబ్బు శ్రీనివాస్, నరేంద్రప్రసాద్, చంద్రమౌళి, భూమన్న, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News