Tuesday, April 30, 2024

81 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్.. భారత్ టార్గెట్ 49

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న డే/నైట్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 81 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ కు ఇంగ్లండ్ జట్టు కేవలం 49 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, అశ్విన్ ల ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లు వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. జాక్ క్రాలే(0), డోమినిక్ సిబ్లే(07), జానీ బెర్‌స్టో(0), బెన్ స్టోక్స్ (25), జోయ్ రూట్ (19), ఓలీ పోప్(12), బెన్ ఫోక్స్(08), జాక్ లీచ్ (09)లు మరోసారి విఫలమయ్యారు. దీంతో ఇంగ్లండ్ జట్టు 30.4 ఓవర్లలో 81 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో అక్షర పటేల్ 5 వికెట్లు పడగొట్టగా అశ్విన్ 4 వికెట్లు, సుందర్ ఒక వికెట్ తీశాడు. కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్ లో 145 పరుగులు చేసింది.

England all out at 81 Day 2 in 3rd test against India

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News