Wednesday, May 22, 2024

వినోదాత్మక చిత్రం ‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’

- Advertisement -
- Advertisement -

సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవిప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన మిస్టరీ థ్రిల్లర్ ‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’ (ఎవరు, ఎక్కడ, ఎందుకు). ఫస్ట్ టైమ్ కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటించారు. సోనిలివ్‌లో ఈ చిత్రం ఈనెల 24న రాబోతోంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎంపీ రఘురామకృష్ణ రాజు, హీరో రాజశేఖర్, జీవిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రామంత్ర క్రియేషన్స్ బ్యానర్ లోగోను ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డా. రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘గుహన్ వండర్‌ఫుల్ టెక్నీషియన్. ఆయనతో శివానీ సినిమా చేస్తుందని తెలియడంతో ఆనందమేసింది. ఇప్పుడు కరెక్ట్ సమయానికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది’ అని అన్నారు. చిత్ర దర్శకుడు గుహన్ మాట్లాడుతూ.. ‘పూర్తిగా వెబ్ క్యామ్‌లో ఈ సినిమా తీశాము. కరోనా, లాక్‌డౌన్ సమయంలో తీశాం. అప్పుడు పుట్టిన భయంలోంచే ఈ కథ వచ్చింది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘురామకృష్ణ, జీవిత రాజశేఖర్, డా. రవి ప్రసాద్, అదిత్, శివానీ రాజశేఖర్, సైమన్ కింగ్, నిరంజన్, మిర్చీ కిరణ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News