Wednesday, May 1, 2024

ప్రేమపెళ్లి…. నవ వధువు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Man Fell In Pond And Died In Medak

బెంగళూరు: ప్రేమ పెళ్లిపై గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టడంతో మనస్థాపం చెంది ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం మైసూర్ ప్రాంతం నంజనగూడు తాలూకాలో జరిగింది. హడెతలె గ్రామానికి చెందిన మంజుల (28), హెమ్మరగాల గ్రామానికి చెందిన సూర్యకుమార్(30) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకోవడంతో దీంతో గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టారు. ప్రజల అందరి ముందు క్షమాపణలు చెప్పాలని నిలదీయడంతో అవమానంతో మంజుల తన ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ రాసింది. సరస్వతీపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News