Monday, April 29, 2024

రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం: పువ్వాడ

- Advertisement -
- Advertisement -

KCR govt fight with Modi govt

 

హైదరాబాద్: రైతులకు న్యాయం జరిగే వరకు, బిజెపి ప్రభుత్వం దిగివచ్చే వరకు కేంద్ర ప్రభుత్వంపై చావు డప్పు మోగించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రం ప్రభుత్వం అవలంభిస్తున్న అనుచిత విధానాలపై టిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండల కేంద్రంలో నిరసనలు నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. కేంద్రం అవలంభించే రాష్ట్ర వ్యతిరేక విధానాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తామన్నారు. కేంద్రం వచ్చే యాసంగిలో ఉప్పుడు బియ్యం కొనమని చెప్పిన విషయాన్ని స్పష్టంగా తెలియజేయలని డిమాండ్ చేశారు.  నిరసన కార్యక్రమంలో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కేంద్రం ప్రభుత్వానికి చావు డప్పు మోగించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News