- Advertisement -
హైదరాబాద్: ప్రముఖ విద్యావేత్త, ఎంఎల్సి చుక్కా రామయ్య 95వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ విద్యానగర్లోని స్వగృహంలో చుక్కా రామయ్యను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు గౌరవంగా పాదాభివందనం చేసి మంత్రి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసు కున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రామయ్యకు వివరించారు. తిరుమల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన శాలువాతో సత్కరించి, మిఠాయిలను అందజేశారు. చుక్కా రామయ్య నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాం క్షించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుని రామయ్య సత్కరించారు. అలాగే సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి కూడా చుక్కా రామ య్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -