హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తల్లి కృష్ణ కుమారి బుధవారం తెల్లవారుజామున కన్నుమూసింది. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో ఆమె భౌతికకాయంపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. తల్లి మరణంతో శోకసంద్రంలో ఉన్న గవర్నర్ తమిళిసై, ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గవర్నర్ మాతృమూర్తి కృష్ణ కుమారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆయన భగవంతుడిని ప్రార్థించానన్నారు.
- Advertisement -