- Advertisement -
గౌహతి: అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొడుకు లండన్ లో అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. మాజీ సిఎం కలిఖో పుల్ మొదటి భార్య కుమారుడు షుబన్సో పుల్, యుకె సస్సెక్స్ లో బ్రైటన్ లోని తన అపార్ట్ మెంట్ లో అనుమానాస్పదంగా చనిపోయినట్లు గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు లండన్ లోని భారత హైకమిషన్ తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. యుకె, షుబన్సో పుల్ మృతదేహాన్ని అతని సొంతూరుకు పంపించేందకు ఏర్పాట్లు చేసినట్లు కుంటుంబ సభ్యులు ఒకరు తెలిపారు. కాగా, మాజీ సిఎం కలిఖో పుల్ 2016లో ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు.
Ex CM Kalikho Pul’s Son found dead in London
- Advertisement -