Sunday, April 28, 2024

రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ అజారుద్దీన్‌కు గాయాలు..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాజస్థాన్‌లోని సవాయి జిల్లా మధోపుర్‌లో బుధవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత క్రికెట్ మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్‌కు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో అజర్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు ముగ్గురు ఉన్నారని, కారు ప్రమాదానికి గురికావడంతో కారు అదుపుతప్పి రోడ్డుపై నుంచి నేరుగా ఒక హోటల్‌లోకి దూసుకుపోయింది.

కాగా, నూతన సంవత్సర వేడుకలకు వెళుతున్న క్రమంలో రాజస్థాన్‌లోని సవాయి జిల్లా మధోపుర్‌లో అజర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో ఆయనకు స్వల్పగాయాలైయ్యాయి. రాజస్థాన్‌లోని రణతంబోర్ జాతీయ పార్కుకు వెళుతుండగా కోటా మెగా హైవేపై అజార్ కారు ఓవర్ టర్న్ కావడం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సుర్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో అజర్ తన కుటుంబం సభ్యులతో కలిసి రణ్‌తంబోర్‌లోని జాతీయ పార్కును సందర్శించేందుకు వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా టైరు పేలడం వల్ల అజారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి హోటల్‌లోకి దూసుకుపోయినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో వెల్లడైంది. ప్రమాదంలో అజర్‌కు స్వల్పగాయాలతో బయటపడగా, హోటల్‌లో పనిచేసే వ్యక్తికి తీవ్రగాయలైయ్యాని అజర్ వ్యక్తిగత సహాయకుడు వివరించాడు.

Ex Cricketer Azharuddin injured in Car Accident

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News