Thursday, May 16, 2024

రాజ్‌కోట్‌లో పేలుడు.. తండ్రికొడుకుల దుర్మరణం

- Advertisement -
- Advertisement -

Explosion in Rajkot kills father and son

అహ్మదాబాద్ : గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో ఓ స్క్రాప్ యూనిట్‌లో జరిగిన పేలుడులో ఇద్దరు మృతి చెందారు. ఉప్లేటా టౌన్‌లో ఉన్న ఈ యూనిట్‌లో శుక్రవారం శక్తివంతమైన పేలుడు జరిగిందని, దీని ఓనర్, కుమారుడు పేలుడు ధాటికి మృతి చెందారని పోలీసులు తెలిపారు. పేలుడు కారణాలను తెలుసుకునేందుకు వెనువెంటనే ఫోరెన్సిక్ నిపుణులను పిలిపించారు. అయితే ఓనరు కొడుకు కలిసి గ్యాస్ కట్టర్ సాయంతో ఓ పాత ఫ్రిజ్ కంప్రెసర్‌ను తెరిచేందుకు యత్నించడంతో పేలుడు జరిగి ఉంటుందని ప్రాధమిక స్థాయిలో నిర్ధారణ అయింది. మృతులను రజాఖ్ కనా, రాయిస్ కనాగా గుర్తించారు. ఘటనపై పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News