Monday, April 29, 2024

తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు

- Advertisement -
- Advertisement -

Extension of night curfew in Telangana

హైద‌రాబాద్ : రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న నైట్ కర్ఫ్యూను సర్కార్ మరో వారం రోజులు పొడిగించింది. మే 8 ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 20వ తేదీ రాత్రి నుంచి నేటి వ‌ర‌కు కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. కర్ఫ్యూ ఇవాళ్టితో  ముగియనుండ‌టంతో ప్రభుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో మరికొన్ని రోజులు కర్ఫ్యూ కొనసాగించాలని ప్ర‌భుత్వం యోచించింది. యదావిధిగా రాత్రి 9 గంట‌ల నుంచి 5 ఉద‌యం గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌లులో ఉండనుంది.

Extension of night curfew in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News