Saturday, April 27, 2024

సిద్దిపేటలో రైతు ఆత్మహత్య కలకలం

- Advertisement -
- Advertisement -

farmer commits suicide in siddipet district

వేలూరు: సిద్దిపేట జిల్లాలోని వేలూరులో ఓ రైతు ఆత్మహత్య కలకలం రేపింది. తన 13 గుంటల పట్టాభూమిని రెవెన్యూ అధికారులు రికార్డులో ఎక్కించలేదన్న మనస్థాపంతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగాడు. దీంతో హూటాహుటిన అతనిని చికిత్స నిమిత్తం సర్కార్ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ నరసింహులు మృతి చెందాడు. రైతు వేదిక భవనానికి భూమి ఇవ్వాలంటూ వేధించారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహంతో సర్పంచ్ ఇంటి బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో వేలూరులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారీగా పోలీసులు మోహరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News