- Advertisement -
హైదరాబాద్: మోడీ ప్రభుత్వం తీసుకవచ్చిన వ్యవసాయ బిల్లు రైతులకు నష్టం కలిగించేలా ఉందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రైతును నట్టేటా ముంచడానికి ప్రయత్నిస్తోందని విమర్శలు గుప్పించారు. పంటలను కార్పొరేట్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని విరుచుకపడ్డారు. వ్యవసాయ బిల్లుకు మోడీ ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
- Advertisement -