- Advertisement -
అమరావతి : ఓ తండ్రి కన్నకూతురు గొంతు కోసం హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా సి బెలగళ్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చింతమానుపల్లెలో తండ్రి రెండేళ్ల కూతురు గొంతు కోశాడు. అనంతరం నిందితుడు ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. కుటుంబ కలహాలతో చిన్నారిని హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా నిందితుడికి మతిస్థిమితం లేదని కుటుంబసభ్యులు వాపోతున్నారు.
- Advertisement -