Monday, April 29, 2024

నంద్యాల హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

కర్నూల్: నంద్యాలలో అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం ఆళ్లగడ్డలోని హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి బ్యాంక్ మొత్తం అలుముకున్నాయి. దీంతో బ్యాంక్ లోని కంప్యూటర్లు, విలువైన డాక్యుమెంట్లు దగ్ధమయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదానికి షాట్ సర్క్యూట్ కారణంగా భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News