ప్రభాస్ 20వ చిత్రం ప్రారంభమై దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతోంది. విదేశాల్లో ఈ చిత్రం షూటింగ్ చాలా రోజులు చేశారు. అయితే ఇప్పటి వరకు సినిమా ఫస్ట్ లుక్ను కూడా విడుదల చేయలేదు. ప్రభాస్ అభిమానులు ఫస్ట్లుక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాను నిర్మిస్తున్న యువి క్రియేషన్స్ మాత్రం ఇప్పట్లో ఫస్ట్ లుక్ను కానీ సినిమాకు సంబంధించిన అప్డేట్ను కానీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. తాజా సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ ఇంకా సగం వరకు ఉందట. కనుక ఇప్పుడే ఫస్ట్ లుక్ విడుదల చేయాల్సిన అవసరం లేదని యూనిట్ సభ్యులు భావిస్తున్నారట.
ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా అక్టోబర్ 23న సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేయాలని… అదే సమయంలో టైటిల్ను కూడా ప్రకటించాలని అనుకుంటున్నారట. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు నుండి ఈ సినిమా షూటింగ్ను హైదరాబాద్లో ప్రారంభించేందుకు భారీ హాస్పిటల్ సెట్ ను నిర్మిస్తున్నన్నారట. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను భారీ ఎత్తున వచ్చే ఏడాదిలో విడుదల చేసే అవకాశం ఉంది.