- Advertisement -
అట్టారీ(అమృత్సర్): పాకిస్థాన్లోని భారత రాయబార కార్యాలయంలో పని చేసే ఐదుగురు అధికారులు సోమవారం స్వదేశంచేరుకున్నారు. అట్టారీవాఘా సరిహద్దు వరకు వారు కారులో ప్రయాణించి భారత్లోకి ప్రవేశించారు. సరిహద్దులోని చెక్పోస్ట్ వద్దే వారికి థర్మల్ స్క్రీనింగ్, ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఢిల్లీకి తరలించారు. భారత్కు చేరుకున్నవారిలో ఎయిర్ అడ్వైజర్ గ్రూప్ కెప్టెన్ మనుమిధా, సెకండ్ సెక్రటరీ ఎస్ శివకుమార్, కార్యాలయ సిబ్బంది పంకజ్, సెల్వదాస్ పౌల్, ద్విమూబ్రహ్మ ఉన్నారు. సెల్వదాస్, ద్విమూలను ఈ నెల 15న పాకిస్థాన్ పోలీసులు హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ చేశారు. భారత్ నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో విడుదల చేశారు.
- Advertisement -