- Advertisement -
హైదరాబాద్ : ఔటర్ రింగ్రోడ్డుపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్ నుంచి గచ్చిబౌలికి వెళ్తుండగా హిమాయత్ సాగర్ వద్ద కారు అదుపుతప్పి బోల్తాపడటంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టైరు ఊడిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.
- Advertisement -