- Advertisement -
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, మానవ హక్కుల కార్యకర్త ఎన్కె భట్టాచార్య కన్నుమూశారు. పౌర హక్కుల వేదిక జన్ హస్తక్షేప్ కన్వీనర్గా ఆయన పనిచేశారు. ఆయన మృతితో ఒక గొప్ప మానవ హక్కుల కార్యకర్తను, మానవతావాదిని కోల్పోయామని జన్ హస్తక్షేప్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. భట్టాచార్య మృతికి భారతీయ కార్మిక సంఘాల సమాఖ్య సంతాపం ప్రకటించింది. ఆయనను మానవ హక్కుల పోరాట యోధునిగా అభివర్ణిస్తూ సమాఖ్య ఘన నివాళులు అర్పించింది. సోమవారం దేశ రాజధానిలో భట్టాచార్య మరణించినట్లు జన్ హస్తక్షేప్ తెలిపింది. ఆయన కుమార్తె మూడు రోజుల క్రితమే కరోనా వైరస్తో మరణించినట్లు తెలుస్తోందని ప్రకటనలో తెలిపింది. ఈ వృద్ధాప్యంలో తన కుమార్తె మరణవార్తను విని ఆయన తట్టుకోలేకపోయారని జన్ హస్తక్షేప్ పేర్కొంది.
Former DU Professor NK Bhattacharya Passes away
- Advertisement -