Saturday, April 27, 2024

జపాన్ మాజీ ప్రధానికి నేతాజీ పురస్కారం ప్రదానం

- Advertisement -
- Advertisement -

Former Japan PM Shinzo Abe given Netaji Award 2022

కోల్‌కతా : నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి పురస్కరించుకుని నేతాజీ రీసెర్చ్ బ్యూరో జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు నేతాజీ అవార్డు 2022ను ప్రదానం చేసింది. ఈ మేరకు కోల్‌కతాలోని ఎల్గిన్ రోడ్‌లో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ నివాసంలో ఆదివారం వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో అవార్డు ను అబేకు ప్రదానం చేస్తున్నట్లు నేతాజీ రీసెర్చ్ బ్యూరో తెలిపింది. అయితే ఈ అవార్డును కోల్‌కతాలోని జపాన్ కాన్సుల్ జనరల్ నకమురా యుటాకా అబే తరపున ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో భారత్‌లోని జపాన్ రాయబారి సతోషి సుజుకీ ఢిల్లీ నుంచి ప్రసంగించారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడి మనవడు, నేతాజీ రీసెర్చ్ బ్యూరో డైరెక్టర్ అయిన సుగతా బోస్, అబేను నేతాజీకి గొప్ప ఆరాధకుడిగా అభివర్ణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News