- Advertisement -
హైదరాబాద్: కరోనా వైరస్ సోకి మాజీ మంత్రి మాతంగి నర్సయ్య (75) దుర్మరణం చెందాడు. నర్సయ్యకు కరోనా పాజిటివ్ రావడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా ఆరోగ్యం విషమించడంతో చనిపోయాడు. నర్సయ్య సతీమణి వారం రోజుల క్రితమే మృత్యువాతపడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మేడారం అసెంబ్లీ నియజక వర్గానికి నర్సయ్య ఎంఎల్ఎగా సేవలందించారు. టిడిపి ప్రభుత్వంలో మంత్రి కూడా పని చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పని చేస్తున్నారు.
- Advertisement -