Tuesday, April 30, 2024

మాజీ రంజీ ఆటగాడు మోహన్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి సీనియర్ నాయకులు, మాజీ రంజీ ఆటగాడు, శాప్ మాజీ చైర్మన్ పి. అర్. మోహన్ కన్నుమూశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో అనారోగ్య సమస్యలతో సోమవారం ఉదయం మోహన్ కన్నుమూశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన మృతిపట్ల హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించానన్నారు. అయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆంధ్ర తరపున రంజీ మ్యాచ్ లలో మోహన్ బ్యాట్స్ మెన్ గా సేవలందించారు. యోగా మాస్టర్ గా కూడా పని చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News