Friday, May 10, 2024

కాబుల్‌లో మసీదులో బాంబు దాడి: నలుగురి మృతి

- Advertisement -
- Advertisement -

Four killed in mosque bombing in Kabul

 

కాబుల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్‌లోని ఒక మసీదులో శుక్రవారం ఒక బాంబు పేలుడు సంభవించి నలుగురు మరణించగా అనేకమంది గాయపడ్డారు. పశ్చిమ కాబుల్‌లోని మసీదులో జరిగిన ఈ బాంబు పేలుడుకు సంబంధించి ఇతర వివరాలు తెలియరాలేదని ఆంతరంగిక వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి తారీఖ్ అరియన్ పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో గత కొన్ని వారాల నుంచి పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇస్లామిక్ స్టేట్ గ్రూపునకు చెందిన అనుబంధ సంస్థలు ఈ హింసకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల మొదట్లో కాబుల్‌లోని ఒక మసీదుపై ఐఎస్‌కు చెందిన మానవబాంబు జరిపిన దాడిలో మతగురువు ఒకరు మరణించగా మరో ఎనిమిది మంది గాయపడ్డారు. గత నెలలో కాబుల్‌లోని ఒక ప్రసూతి ఆస్పత్రిపై ఐఎస్‌కు సంబంధించిన ఉగ్ర సంస్థ జరిపిన అమానుష దాడిలో ఇద్దరు శిశువులతో సహా 24 మంది మరణించారు. మృతులలో బాలింతలు కూడా ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News