Saturday, April 27, 2024

కొడుకు నిర్వాకం…. తల్లి షాక్… ఆకౌంట్ ఖాళీ…

- Advertisement -
- Advertisement -

Four lakhs loss with Online games

హైదరాబాద్: తన ఆకౌంట్‌లో నాలుగు లక్షల రూపాయలు లేకపోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఓ మహిళ ఆశ్రయించింది. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అసలు విషయం తెలిసి తల్లి షాక్ గురైన సంఘటన రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ మహిళ తన ఫోన్ ద్వారా ఆన్‌లైన్ చెల్లింపులు చేస్తూ ఉంటుంది. ఒక్క రోజు బ్యాంక్ వెళ్లి ఆకౌంట్ వివరాలు చూడగా నాలుగు లక్షల రూపాయలు మాయమైనట్టు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఆమె ఫోన్ ను స్వాధీనం చేసుకొని విచారణ చేయగా ఆమె కుమారుడు ఫోన్ తీసుకొని రాత్రి సమయంలో ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడుతూ డబ్బులు చెల్లించేవాడు. ఒటిపిలను డిలీడ్ చేసి యథావిధిగా ఫోన్‌ను తన తల్లికి ఇచ్చేవాడు. ఇలా నాలుగు లక్షల రూపాయలు ఆన్ లైన్ గేమ్ కోసం వినియోగించాడు. తనయుడి నిర్వాకం బయటపడంతో తల్లి కంగుతింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News