Saturday, May 4, 2024

సద్దాం హుస్సేన్ స్ఫూర్తి…. అత్తింటివారిని ఫిష్ కర్రీతో ఫినిష్…

- Advertisement -
- Advertisement -

 

Son in law killed mother in law and sister in law

 

ఢిల్లీ: అల్లుడు చేపల కూరలో విషం కలిపి అత్తింటి వారికి పెట్టడంతో అత్త, మరదలు చనిపోయిన సంఘటన ఢిల్లీలో జరిగింది. ఈ ఘటనలో మామ, భార్య, పనిమనిషి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రైటర్ కైలాష్‌లో వరుణ్ అరోరా అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. అత్తింటి వారితో ఎప్పుడు గొడవలు జరుగుతుండడంతో వారిని అంతం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇరాక్ మాజీ అధినేత సద్దాం హుస్సేన్ స్పూర్తిగా తీసుకొని మర్డర్లకు ప్లాన్ చేశాడు. సద్దా హుస్సేన్ తన ప్రత్యర్థులను చంపాడానికి థాలియం అనే విషం పదార్థాని వాడేవాడు. అత్తింటివారిని థాలియంతో అంతం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. వరుణ్ జనవరి చివరి వారం తన అత్తగారింటికి వెళ్లాడు. పోతు పోతూ దారిలో చేపల కూర తీసుకొని అందులో కొంచెం థాలియం కలిసి అత్తకు ఇచ్చాడు. చేపల కూర తిన్న అత్త అనితా దేవీ, మామ దేవేందర్, మరదలు ప్రియాంక, భార్య దివ్య అస్వస్థతకు గురికావడంతో స్థానిక ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ అత్త, మరదలు మార్చి 15న మృతి చెందారు. శవ పరీక్షలో విష ప్రయోగంతో చనిపోయినట్టు తేలడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతున్న మామ, భార్య, పని మనిషిది రక్తం తీసుకొని పరీక్షలు చేయగా థాలియం అనే విష పదార్థం కలిసినట్టు గుర్తించారు. అల్లుడిపై అనుమానం రావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నాడు. పదే పదే అత్తింటివారు వేధిస్తుండడంతో ప్రతీకారం తీర్చుకోవడానికి ఇలా చేశానని చెప్పుకొచ్చాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News