Friday, April 26, 2024

 నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

నారాయణపేట : రెండు బైకులు ఢీకొని నలుగురు మృతి చెందిన సంఘటన  నారాయణపేట  జిల్లాలోని కృష్ణ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనలో  ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

మృతి చెందిన వారంతా మాగనూరుకు మండలానికి చెందిన వారు  అశోక్, ఆంజనేయులు భార్య నరసమ్మ కుమారుడు అనిరుద్ గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News