Saturday, April 27, 2024

Journalist: ఈ నెల 29 నుంచి మహిళా జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: అక్రిడిటేటేడ్ మహిళా జర్నలిస్టులకు ఉచిత వైద్య శిభిరం నిర్వహించనున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ అర్వింద్ కుమార్ తెలిపారు. ఈ నెల 29 నుంచి 10 రోజుల పాటు నిర్వహించనున్న ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర స్థాయి అక్రిడిటేటేడ్ మహిళా జర్నలిస్టులతో పాటు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుండి అక్రిడిటేషన్ పొందిన మహిళా జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో కోరారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మహిళా జర్నలిస్టులకు పురస్కార కార్యక్రమంలో మహిళా జర్నలిస్టులు ఉచిత వైద్య శిభిరం నిర్వహించాల్సిందిగా పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావుకి విజ్ఞప్తి మేరకు ఈ నెల 29 తేది నుండి మాసాబ్ ట్యాంక్ లో ఉన్న సమాచార పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న ఉచిత వైద్య శిబిరం 10రోజుల పాటు ఉదయం7.00 గంటల నుంచి మధ్యాహ్నం 2 .00 గంటలకు ఉంటుందని వెల్లడించారు.

ఈ కాంప్రహెన్సివ్ హెల్త్ చెకప్ లో భాగంగా రక్త పరీక్ష (సిబిపి) , బ్లడ్ షుగర్, డయాబెటిక్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కాల్షియం, మూత్ర పరీక్షలు, విటమిన్ బి12, డి3 మొదలైన డయాగ్నోస్టిక్స్ పరీక్షలు ,ఈసిజి, ఎక్స్-రే, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రామ్, పాప్ స్మియర్, స్క్రీనింగ్ పరీక్షలు, మెడికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్, కంటి స్క్రీనింగ్ , దంత పరీక్షలు, గైనకాలజీ పరీక్షలు మొదలైన పరీక్షలు చేయనున్నారు. ఈ పరీక్షల రిపోర్ట్ లు అదే రోజు అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లాలకు చెందిన అక్రిడిటేటేడ్ మహిళా జర్నలిస్టులకు ఆయా జిల్లా కేంద్రాలలో ఉచిత వైద్య శిభిరాలను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News