- Advertisement -
కోల్కతా: మొదటి దశ ప్లేస్మెంట్ ఇంటర్వూల్లో తమ సంస్థ నుంచి 1000మందికిపైగా విద్యార్థులు పలు ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి ఉద్యోగావకాశాలను పొందారని ఐఐటి ఖారగ్పూర్ చైర్మన్ ప్రొఫెసర్ ఎ.రాజ్కుమార్ తెలిపారు. 202021 విద్యా సంవత్సరంలో డిగ్రీలు పుచ్చుకోనున్న విద్యార్థులకు మొదటిదశలో ఇంటర్వూలు నిర్వహించారు. 8 రోజులపాటు జరిగిన ఎంపిక ప్రక్రియలో 200కుపైగా కంపెనీలు పాల్గొన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, జెపి మోర్గాన్, సోనీ జపాన్, ఎక్స్ఎల్ సర్వీస్, ఒరాకిల్, అమేజాన్, విప్రో, టాటా స్టీల్, ఎయిర్బస్లాంటి సంస్థలకు మొదటి దశలో ఎంపికైనట్టు రాజ్కుమార్ పేర్కొన్నారు. వీరి సగటు వేతనం ఏడాదికి రూ.19 లక్షలని ఆయన తెలిపారు. ఈ నెల 11వరకు మొదటిదశ ప్లేస్మెంట్స్ కొనసాగుతాయని తెలిపారు. రెండోదశను జనవరి రెండో వారంలో నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.
- Advertisement -