Monday, April 29, 2024

కళ్యాణం… కమనీయం

- Advertisement -
- Advertisement -

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక వివాహం చైతన్య జొన్నలగడ్డతో అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్‌లో బుధవారం రాత్రి జరిగిన ఈ వేడుకలో నిహారిక మెడలో చైతన్య మూడు ముళ్లు వేశారు. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వివాహంలో బంగారు వర్ణం వస్త్రాల్లో పెళ్లి కూతురు నిహారిక మెరిసిపోయింది. ఈ వేడుకలో నాగబాబు దంపతులు, చిరంజీవి దంపతులు, అల్లు అరవింద్ దంపతులు, అల్లు అర్జున్, రామ్‌చరణ్, మెగా హీరోలతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.


డ్యాన్స్‌లతో మురిపించారు
నిహారిక మెహంది వేడుక మంగళవారం సాయంత్రం కన్నుల పండుగగా సాగింది. ఉదయ్ విలాస్ హోటల్‌లో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ నుండి కొన్ని ఫోటోలు బయటికి వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు సందడి చేస్తున్నాయి. ముగ్గురు సోదరులు చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ సహా మెగా యువ హీరోలంతా ఈ మెహందీ వేడుకలో పాల్గొన్నారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్, పవన్ కల్యాణ్ వారసుడు అకీరా నందన్ ఈ వేడుకలో హల్‌చల్ చేశారు. అదేవిధంగా అగ్ర నిర్మాత అల్లు అరవింద్ దంపతులు, వారి కుమారులు అల్లు అర్జున్, శిరీష్, బాబి ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇక మెహందీ వేడుకలో చిరు, సురేఖ దంపతులు, అల్లు అర్జున్ ‘బంగారు కోడిపెట్టా’ పాటకు స్టెప్పులేయగా… అల్లు అరవింద్, నిర్మల దంపతులు ‘రామా చిలకమ్మా…’ పాటకు డ్యాన్స్ చేశారు. అదేవిధంగా ‘గ్యాంగ్‌లీడర్’ పాటకు నిహారిక, చైతన్యతో కలిసి నాగబాబు డ్యాన్స్ చేసి కనువిందు చేశారు. ఈ మెహందీ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి.

Niharika Get Engaged with Chaitanya in Udaipur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News