Saturday, May 4, 2024

ప్రయాణికులకు శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. తిరుపతి టు షిర్డీ సాయినగర్ (రైలు నంబర్ 07637) రైలును సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రతి ఆదివారం నడువనున్నట్టు తెలిపింది. అలాగే షిర్డీ సాయినగర్ -టు తిరుపతి (07638) రైలును సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రతి సోమవారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.

కాజీపేట టు దాదర్ (07195) రైలు సెప్టెంబర్ 6 నుంచి 27వ తేదీ వరకు ప్రతి గురువారం, దాదర్ – టు కాజీపేట (07195) రైలు ప్రతి శనివారం నడుస్తుందని అధికారులు పేర్కొన్నారు. సెప్టెంబర్ 6వ తేదీ నుంచి సెప్టెంబర్ 27వ తేదీ వరకు ఈ రైళ్లను పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది. కాజీపేట – టు దాదర్ (07197) వీక్లీ రైలు సెప్టెంబర్ 2-వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రతి శనివారం నడువనుండగా, దాదర్ టు- కాజీపేట (07198)ల మధ్య రైలు ఆదివారం అందుబాటులో ఉండనుండగా సెప్టెంబర్ 3వ తేదీ నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు పొడిగించినట్టు అధికారులు తెలిపారు.

అక్టోబర్ 3వ తేదీ వరకు ప్రత్యేక రైళ్ల పొడిగింపు
అలాగే హైదరాబాద్ -టు రక్సౌల్ (07051)ల మధ్య ప్రతి శనివారం రైలు నడువనుండగా సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 30వ తేదీ వరకు, రక్సౌల్ – హైదరాబాద్ రైలు ప్రతి మంగళవారం సెప్టెంబర్ 5వ తేదీ నుంచి -అక్టోబర్ 3వ తేదీ వరకు నడుపనున్నట్టు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ టు – దానాపూర్ (07419)ల మధ్య సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 30వ తేదీ వరకు, దానాపూర్ టు- సికింద్రాబాద్ (07420)ల మధ్య ప్రతి సోమవారం సెప్టెంబర్ 4వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు రైలు పరుగులు తీయనుంది. సికింద్రాబాద్ -టు రక్సౌల్ (07007) మధ్య ప్రతి బుధవారం 6 వ తేదీ నుంచి 27వ తేదీ వరకు

రక్సౌల్ – టు సికింద్రాబాద్ మధ్య ప్రతి శుక్రవారం సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 29వ తేదీ వరకు పొడిగించినట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్ -టు జైపూర్ (07115)ల మధ్య ప్రతి శుక్రవారం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 29వ తేదీ వరకు, జైపూర్ -టు హైదరాబాద్ (07116) మధ్య ప్రతి ఆదివారం సెప్టెంబర్ 3వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు నడువనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అలాగే కాచిగూడ టు – బికనీర్ (07053) మధ్య ప్రతి శనివారం సెప్టెంబర్ 2వ తేదీ నుంచి సెప్టెంబర్ వరకు, బికనీర్ టు -కాచిగూడ (07054)ల మధ్య ప్రతి మంగళవారం సెప్టెంబర్ 5వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు ప్రత్యేక రైలును పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News