Monday, April 29, 2024

సబ్బండ వర్గాలకు సర్కార్ అండ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వం పేదరికం నిర్మూలనకు కట్టుబడి ఉందని రాష్ట్ర ఎస్‌సి అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. అన్ని కులాలు, మతాలను గౌరవిస్తూ వారికి సమానంగా సంక్షేమాన్ని అందించడం జరుగుతుందని చెప్పారు. మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థ్ధిక సా యం పథకాన్ని శనివారంనాడు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఆయన లాంఛనంగా ప్రా రంభించారు. అనంతరం మాట్లాడుతూ ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని గుర్తు చేశారు. గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో మైనార్టీల సంక్షేమం కోసం రూ.15వేల కోట్లు ఖర్చు చేశామని, సంవత్సరానికి రూ. 2200 కోట్ల నిధులు బడ్జెట్‌లో కేటాయించి ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నిధుల నుంచి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు రూ. 270 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. వంద శాతం సబ్సిడీ కింద ఒక్కో లబ్ధిదారుడికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 27వేల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు.

ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 10వేల మంది కి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున వంద కోట్లు అం దిస్తున్నామని తెలిపారు. తొమ్మిదేళ్ల కాలంలో ఎలాంటి అల్లర్లు, అలజడి లేకుండా హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జనరంజకంగా పాలన కొనసాగుతుందన్నారు. జనాభా ప్రాతిపదికన న్యాయం జరుగాలని సిఎం కెసిఆర్ ఆలోచన చేశారన్నారు. గతంలో మైనార్టీ వర్గాల పిల్లలు చదువుకు దూరంగా ఉండే పరిస్థితి ఉండేదని, ప్ర త్యేక రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదన్నారు. 204 మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి అందరికీ విద్య అందేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. లక్షకు పైగా విద్యార్థ్ధులకు పూర్తిగా ఉచితంగా విద్య అందుతుందని అ న్నారు. కోణంలో సిఎం కెసిఆర్ ఆలోచన చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

నిరుపేద మైనార్టీ విద్యార్థ్ధులు విదేశాల్లో చదువుకోవడానికి ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం కింద ఒక్కో విద్యార్థికి 20 లక్షలకు పైగా ఇస్తున్నట్లు చెప్పారు. దేశంలోనే ఒంటరి మహిళలకు తెలంగాణ ప్రభుత్వం మా త్రమే పెన్షన్ ఇస్తుందన్నారు. సిఎం కెసిఆర్ ఇవ్వని హామీ లు సైతం అమలు చేస్తూ మైనార్టీ జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని, ఇది దేశానికే ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహామూద్ అలీ, ఎంఎల్‌ఎలు అబ్దుల్ అహ్మద్ బీన్ బలాలా, జాఫర్ హుస్సేన్, కాలేరు వెంకటేశ్, తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ మహ్మద్ ఇంతియాజ్ ఇషాక్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజేశ్వర్ రావు, మైనార్టీ వెల్ఫేర్ ప్రభుత్వ సలహాదారు ఎకె ఖాన్, ఎంఎల్‌సి ప్రభాకర్ రావు, హజ్ కమిటీ చైర్మన్ తారిక్ అన్సారీ, ఎంఎల్‌సి మీర్జా రియాజు ల్ హసన్ ఇప్తారియా, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మసివుల్లా ఖాన్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉమర్ జలీల్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి కాంతి వెస్లీ తదితరులు పాల్గొన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News