- Advertisement -
మన తెలంగాణ /హైదరాబాద్ : గ్రేటర్ మేయర్ పీఠం ఈ సారి జనరల్ మహిళకు కేటాయించారు. దీంతో నగర ప్రథమ పౌరురాలిగా ఈ సారి మహిళ కానుంది. జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించి 2016నాటి రిజర్వేషన్లనే అమలు చేయనున్నారు. జిహెచ్ఎంసి యాక్టు ప్రకారం ప్రతి ఎన్నికలకు ముందు రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉండేది. అయితే ్రప్రతి రెండు ఎన్నికల తర్వాత రిజర్వేషన్ల మార్పు చేర్పులు చేపట్టేవిధంగా ప్రభుత్వం ఇటీవలే జిహెచ్ఎంసి యాక్టు సవరించింది. దీంతో ఈ ఎన్నికలనుసైతం గత రిజర్వేషన్ల ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా 150 వార్డులకు గాను రిజర్వేషన్లను ప్రకటించారు. ఎస్టి 2 (జనరల్ 1, మహిళ 1), ఎస్సీ 10 (జనరల్ 5, మహిళ 5), బిసి 50 (జనరల్ 25, మహిళ 25), 88 జనరల్ సీట్లకు గాను మహిళలకు 44, జనరల్ 44 కేటాయించారు.
- Advertisement -