Monday, April 29, 2024

94 శాతానికి పెరిగిన రికవరీ రేటు

- Advertisement -
- Advertisement -

952 New Covid Cases And Three Deaths in Telangana

హైదరాబాద్: రాష్ట్రంలో రికవరీ రేట్ అమాతంగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రికవరీ రేట్ 94.14 శాతానికి పెరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ట్రిపుల్ టి విధానంతోనే ఇది సాధ్యమవుతున్నట్లు ఆరోగ్యశాఖ నివేదించింది. ఇదిలా సోమవారం 38,245 టెస్టులు చేయగా 952 పాజిటివ్‌లు తేలాయి. వీటిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 150 ఉండగా ఆదిలాబాద్‌లో 15, భద్రాద్రి 71, జగిత్యాల 26, జనగాం 8, భూపాలపల్లి 12, గద్వాల 8, కామారెడ్డి 24, కరీంనగర్ 35,ఖమ్మం 41, ఆసిఫాబాద్ 11, మహబూబ్‌నగర్ 15, మహబూబాబాద్ 14, మంచిర్యాల 33, మెదక్ 16 , మేడ్చల్ మల్కాజ్‌గిరి 77, ములుగు 19, నాగర్‌కర్నూల్ 16, నల్గొండ 45, నారాయణపేట్ 1, నిర్మల్ 14, నిజామాబాద్ 23, పెద్దపల్లి 29, సిరిసిల్లా 19, రంగారెడ్డి 68, సంగారెడ్డి 20, సిద్ధిపేట్ 23, సూర్యాపేట్ 32, వికారాబాద్ 6, వనపర్తి 6, వరంగల్ రూరల్ 13, వరంగల్ అర్బన్ లో 44, యాదాద్రిలో మరో 18 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా వైరస్ దాడిలో మరో ముగ్గురు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,58,828కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,43,686కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

1410కి చేరిన కోవిడ్ మరణాల సంఖ్య…

కరోనా వైరస్ దాడిలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1410 మంది మరణించినట్లు ఆరోగ్యశాఖ స్పష్టం పేర్కొంది. వీరిలో 44.96 శాతం మంది కేవలం కోవిడ్ 19తో చనిపోగా మరో 55.04 శాతం మంది కో మార్పిడ్ కండీషన్‌తో చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర మరణాల సంఖ్య అతి తక్కువగా ఉందని హెల్త్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది.

2419 మందికే హాస్పిటల్ చికిత్స…

కరోనా వైరస్ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు కేవలం 2419 మంది మాత్రమే హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు హెల్త్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. వాస్తవంగా ఇప్పటి వరకు 2,58,828 మందికి వైరస్ సోకగా వీరిలో ఇప్పటికే 2,43,686 మంది ఆరోగ్యవంతులుగా మారారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 13,732 మంది ఉండగా వీరిలో ఏకంగా 11,313 మంది ఐసోలేషన్‌లోనే చికిత్స పొందుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

49 లక్షలు దాటిన కోవిడ్ పరీక్షలు…

రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 49 లక్షలు దాటింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 49,29,974 మందికి టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. అంటే ప్రతి పది లక్షల మందిలో లక్షా 32 వేల 454 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు హెల్త్ డైరెక్టర్ తెలిపారు. రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను మరింత పెంచుతున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. మరోవైపు ప్రతి రోజూ నిర్వహిస్తున్న పరీక్షల్లో 44 శాతం మంది ప్రైమరీ కాంటాక్ట్‌లకు టెస్టులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాజిటివ్ వచ్చిన వెంటనే ప్రైమరీ కాంటాక్ట్‌లందరిని వేగంగా ట్రేస్ చేసి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్యశాఖ నివేదించింది. ఇదిలా ఉండగా రాబోయే రోజుల్లో భారీ టెస్టులు చేసేందుకు ఆరోగ్యశాఖ సిద్ధమైంది. ఈమేరకు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను కూడా సమకూర్చుకుంది. మరో రెండు రోజుల్లో భారీ టెస్టుల కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News