Saturday, May 4, 2024

సెతల్వాడ్, శ్రీకుమార్ కు బెయిల్ నిరాకరించిన గుజరాత్ కోర్టు

- Advertisement -
- Advertisement -

 

SriKumar and Teesta

గాంధీనగర్: కల్పిత సాక్ష్యాలను సృష్టించి, బోధిస్తున్నారనే ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్‌లో సబర్మతి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ముంబై కార్యకర్త తీస్తా సెతల్వాడ్, మాజీ డిజిపి ఆర్‌బి  శ్రీకుమార్ సాధారణ బెయిల్ దరఖాస్తులను సిటీ సెషన్స్ కోర్టు శనివారం తిరస్కరించింది. వారి అభ్యర్థనలను తిరస్కరిస్తూ  అదనపు ప్రిన్సిపల్ జడ్జి, డి డి ఠక్కర్ తన విచక్షణా అధికారాన్ని ఉపయోగించే ముందు  కోర్టు తీవ్రత , స్వభావం,  నిందితులపై మోపబడిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తన ఆర్డర్‌లో పేర్కొన్నారు.

సెతల్వాడ్, శ్రీకుమార్, మరో సహ-నిందితుడైన మాజీ ఐపిఎస్ అధికారి సంజీవ్ భట్ నాటి ముఖ్యమంత్రి నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వాన్ని “అస్థిరపరచడానికి” ఉద్దేశించిన “పెద్ద కుట్ర”లో భాగమని రాష్ట్ర ప్రభుత్వం వారి బెయిల్ పిటిషన్లను వ్యతిరేకించింది. నాడు మోడీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి అహ్మద్ పటేల్ నుంచి వివిధ సందర్భాల్లో సెతల్వాడ్ కు రూ. 30 లక్షలు అందాయని ప్రాసిక్యూటర్ ఆరోపించారు. ముగ్గురు సాక్షుల వాంగ్మూలం ఆధారంగానే వారిపై నేరారోపణ ఉందని, వారిలో ఒకరైన రయీజ్ ఖాన్ ఒకప్పుడు సెతల్వాడ్ దగ్గర పనిచేశారని కూడా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News