Friday, April 26, 2024

బిఆర్ఎస్ ప్రభుత్వానికి పేదలు ఆత్మబంధువులు : హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట : దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అధికారికంగా క్రిస్మస్ పండుగను జరిపిస్తున్నారని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. పేదలే బిఆర్ఎస్ ప్రభుత్వానికి, పార్టీకి ఆత్మబంధువులని, పేదలకు సాయం చేయడమే బిఆర్ఎస్ ప్రభుత్వ విధి అని పేర్కొన్నారు. సిద్ధిపేట సిఎస్ఐ చర్చిలో ఆదివారం క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని జరిపిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ తో కలిసి మంత్రి హాజరయ్యారు. ఈ మేరకు కేక్ కట్ చేసి క్రైస్తవ ఫాస్టర్లకు, క్రైస్తవ సోదర, సోదరీమణులకు తినిపించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.

దేశంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా రెండు రోజులు సెలవు ప్రకటించిన ప్రభుత్వం బిఆర్ ఎస్ అని పేర్కొన్నారు. భారత దేశం భిన్నత్వంలో ఏకత్వమని, అన్నీ కులాలు, మతాలు కలిసి ఉన్న దేశమని ప్రశంసించారు. పేద ప్రజలకు సాయం చేయడం ప్రభుత్వాల విధిగా చెబుతున్నామని, పేదలు బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఆత్మబంధువులని కొనియాడారు. సిద్ధిపేట సిఎస్ఐ చర్చి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్సవాలను జరుపుతుందని, ఈ ఉత్సవాలకు సంపూర్ణ సహకారం అందిస్తానని హరీశ్ రావు హామీ ఇచ్చారు. సిద్ధిపేట నియోజకవర్గాన్ని అన్నీ రంగాలలో అభివృద్ధి చేస్తున్నామని  వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News