Saturday, May 11, 2024

రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను లాగడం, కించపరచడం తగదు: హరీష్

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao visit Narayankhed

హైదరాబాద్: రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను లాగడం, కించపరచడం తగదని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ట్విట్టర్‌లో ఖండించారు. హానకరమైన సమాచారాన్ని వ్యాప్తి చేసేలా సోషల్ మీడియా యంత్రాంగాన్ని ప్రోత్సహించడం బిజెపికి తెలిసిన వ్యూహమన్నారు. అభివృద్ధి ఎక్కడ జరిగింది?.. భద్రాచలం గుడిలోనా? హిమాన్షు శరీరంలో జరిగిందా? అని తీన్మార్ మల్లన్న సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తీన్మార్ మల్లన్న ట్వీట్ పై తెలంగాణ ప్రజానీకం అగ్రహం వ్యక్తం చేస్తుంది. నెటిజన్లు మల్లన్న ట్వీట్ ను తప్పుపడుతున్నారు. జర్నలిస్టులు అభివృద్ధి, అవినీతిపై ప్రశ్నించాలి కానీ వ్యక్తిగత విమర్శలు, కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో దూషణలు చేయడం సరికాదని తెలంగాణ ప్రజలు కామెంట్లు చేస్తున్నారు.  జర్నలిస్టులు కూడా రాజకీయం చేస్తే ఎవరిని నమ్మాలో అర్థం కావడంలేదని నెటిజన్లు వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News