Wednesday, May 15, 2024

కెటిఆర్ కు మద్దతుగా షర్మిల ట్వీట్…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంత్రి కెటిఆర్ కు వైెఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు షర్మిల మద్దతు పలికారు. ఒక తల్లిగా ఒక రాజకీయ నాయకురాలిగా ఇలాంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నానని తెలిపారు. మహిళల పట్ల కానీ చిన్న పిల్లల పట్ల గాని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు రాజకీయాలను పక్కన పెట్టి వీటిని నాయకులు ఖండించాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి ఎక్కడ జరిగింది?.. భద్రాచలం గుడిలోనా? హిమాన్షు శరీరంలో జరిగిందా? అని తీన్మార్ మల్లన్న ట్వీట్ చేశారు. తీన్మార్ మల్లన్న ట్వీట్ పై తెలంగాణ ప్రజానీకం అగ్రహం వ్యక్తం చేస్తుంది. నెటిజన్లు మల్లన్న ట్వీట్ ను తప్పుపడుతున్నారు. జర్నలిస్టులు అభివృద్ధి, అవినీతిపై ప్రశ్నించాలి కానీ వ్యక్తిగత విమర్శలు, కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో దూషణలు చేయడం సరికాదని తెలంగాణ ప్రజలు కామెంట్లు చేస్తున్నారు.  జర్నలిస్టులు కూడా రాజకీయం చేస్తే ఎవరిని నమ్మాలో అర్థం కావడంలేదని నెటిజన్లు వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News