Saturday, April 27, 2024

హుజురాబాద్ ప్రజలు బొట్టుబిల్లలు, గడియారాలకు మోసపోవద్దు

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: హుజురాబాద్ పట్టణములో ప్రతాప సాయి గార్డెన్ లో భూమి ఆధీనం, నీటి కుళాయి, విద్యుత్ కనెక్షన్, ఇంటి అనుమతుల పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, ఎస్సి కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ”ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, ప్రభుత్వ కార్యాలయాలు తిరగకుండా ఇంటి మ్యుటేషన్ కాగితాలు, నల్లా, విద్యుత్ కనెక్షన్, విద్యుత్ మీటర్ మార్పు వంటి పత్రాలు మీకు అందజేయడం జరిగింది. పని చేసే ప్రభుత్వం, పని చేసే నాయకుడు ఉంటే పని ఎంత వేగంగా జరుగుతుందో దీని వల్ల అర్థమవుతుంది. కొద్ది మంది నేతలు తమ బాధలను ప్రజల బాధగా రుద్ది లాభపడుతుంటే, ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస ప్రభుత్వం ప్రజల బాధను, తమ బాధగా భావించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. కొద్ది మంది బాగా మాట్లాడుతున్నారు.. పెరిగిన సిలిండర్ ధర తగ్గిస్తామని ఎందుకు చెప్పడం లేదు. దమ్ముంటే గడియారాలు, బొట్టుబిల్లలు కాదు, వేయి రూపాయలకు పెంచిన సిలండర్ ధర తగ్గిస్తామని హుజూరాబాద్ ప్రజలకు చెప్పి ఓట్లు అడగండి.

బీజేపీకి ఓటు వేస్తే…పెంచిన ధరలకు ప్రజలు మద్ధతు ఇస్తున్నారని చెప్పి సిలిండర్ ధర మూడు వేలు, మంచి నూనె ధర 300 రూపాయలకు పెంచుతారు. ఓటుకు రెండు వేలు ఈ ఒక్క రోజు చేతిలో పెట్టి, రేపటి నుండి సిలండర్ ధర మూడు వేలకు పెంచి మన వద్ద నుండి వసూలు చేస్తారు. బొట్టుబిల్లలు, గడియారాలకు మోసపోవద్దు. పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి. తెరాస ప్రభుత్వం ప్రజల బాధలను తమ బాధలుగా భావించే వృద్దులకు ఆసరా, పేదింటి ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలు ఇస్తోంది. మొన్న వరద వస్తే ఇంటికి 3800 రూపాయలు సాయం అందించాం. డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చేది తెరాస ప్రభుత్వం కాదా. మాయమాటలు చేప్పే వారివైపు ఉంటారా.. న్యాయం, ధర్మం వైపు ఉంటారా ప్రజలే ఆలోచించుకోవాలి. తన బాధను ప్రజల మీద రుద్ది ఓ పెద్దమనిషి లబ్ధి పొందాలనుకుంటున్నారు. హుజూరబాద్ సంక్షేమం, అబివృద్ధి ఆగొద్దంటే… తెరాస ప్రభుత్వాన్ని బలపర్చాలి” అని కోరారు.

Harish Rao speech at Huzurabad Town

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News