Tuesday, May 7, 2024

క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించండి: హైకోర్టు

- Advertisement -
- Advertisement -

HC Orders TS Govt to impose restrictions for Omicron

హైదరాబాద్: రాష్ట్రంలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. మహారాష్ట్ర, ఢిల్లీలో విధించిన ఆంక్షలనే ఇక్కడా అమలు చేయాలని, రెండు మూడు రోజుల్లో ఆంక్షలు విధించాలని కోర్టు పేర్కొంది. జనం గుంపులుగా ఉండకుండా ప్రభుత్వం ఆదేశాలివ్వాలని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారందరికీ పరీక్షలు చేయాలని రాష్ట్ర ప్రబుత్వానికి హైకోర్టు ఆదేశించింది. దీంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, హైకోర్టు ఆదేశాలపై స్పందించారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవిస్తామని, ఒమిక్రాన్ కట్టడికి చర్యలు  తీసుకుంటామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కిరికి టెస్టు చేస్తామని మంత్రి చెప్పారు.

HC Orders TS Govt to impose restrictions for Omicron

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News