Monday, April 29, 2024

ఢిల్లీని ముంచెత్తిన కుండపోత వర్షం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.శనివారం తెల్లవారు జాము నుంచి ఢిల్లీలో కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహదారులు ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో కాలనీలు కూడా నీట మునిగాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలోని పూల్ ప్రహ్లాద్ పూర్, ఇండియా గేట్, మధు విహార్, మోతీ బాగ్, ఆర్ కె పురం, జోర్ బాగ్ ప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తింది. మరోవైపు ఢిల్లీలో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Heavy Rains in several areas in Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News