Friday, April 26, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన ఆది పినిశెట్టి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఆర్ఎస్ ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రంగస్థలం సినిమాలో తన సహచర నటుడు శత్రువు(విలన్ పాత్ర) విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన హీరో ఆది పినిశెట్టి ఆదివారం రామోజీ ఫిలింసిటీలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ అనేది చాలా అద్భుతమైన కార్యక్రమమన్నారు. సోషల్ మీడియాలో మనం వివిధ రకాల చాలెంజ్ లు చూస్తూ ఉన్నామని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భవిష్యత్ తరాలకు ఉపయోగపడే చాలెంజ్ అని ఆది అన్నారు. వాతావరణ కాలుష్యం ఏ విధంగా తయారవుతుందో మనము రోజు చూస్తున్నామని, దీన్ని సంరక్షించాలి అంటే మనందరం బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు.

మాలాంటి సెలబ్రిటీస్ ద్వారా ఇది ప్రజల్లోకి వెళితే ఇంకా అద్భుతంగా విజయం సాధిస్తుందన్న ఉద్దేశ్యంతో ఎంపి సంతోష్ కుమార్ ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకోనిపోవడం చాలా సంతోషకరమైన విషయమని ఈ సందర్భంగా ఆయనకు  అభినందనలు తెలుపుతున్నానన్నారు. తనకు ఈ చాలెంజ్ ఇచ్చిన సహచర నటుడు శత్రువుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ, కిషోర్ గౌడ్ లు వృక్ష వేదం పుస్తకాన్ని ఆది పినిశెట్టికి అందజేశారు. వృక్ష వేదం పుస్తకాన్ని చూసి చాలా అద్భుతంగా ఉందని ఆది ప్రశంసించారు. తర్వాత, తన సహచర నటుడు, బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తి, హీరోయిన్స్ ఆకాంక్ష సింగ్, నిక్కీ గల్ రాణి, హీరో రాహుల్ రవీంద్రకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని ఆది పిలుపునిచ్చారు.

Hero Aadhi Pinisetty plant Saplings at Ramoji film City

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News