Monday, April 29, 2024

అభిమానులే అతిథులుగా..!

- Advertisement -
- Advertisement -

Hero prabhas acting in radhe shyam

 

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తయి పోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన రాధే శ్యామ్ పాటలన్నింటికీ అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్ బయటికి వచ్చింది. ఈనెల 23న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. అభిమానులే అతిథులుగా ఈ పాన్ ఇండియా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తారట.

ఈ కార్యక్రమం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగనుంది. పూర్తిగా కోవిడ్ నిబంధనలు పాటించి ఈ వేడుకను నిర్వహిస్తారు. అక్కడికి వచ్చిన అభిమానులు, అతిథులు నిబంధనలకు కట్టుబడి రావాలి అంటూ ఫిల్మ్‌మేకర్స్ తెలిపారు. అదే రోజు 5 భాషలకు సంబంధించిన ట్రైలర్ విడుదల కానుంది. అంతే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు అక్కడికి రానున్నారు.

వాళ్ళ చేతుల మీదుగానే ట్రైలర్ విడుదల కానుంది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో.. తన సినిమా ట్రైలర్ అభిమానులతో విడుదల చేయించడం నిజంగా గొప్ప విషయం. ఈ సినిమా కోసం చాలా మంది సంగీత దర్శకులు పని చేస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్, నార్త్ ‘రాధే శ్యామ్’ సినిమా వర్షన్స్‌కు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News