Friday, May 3, 2024

పార్శిళ్ల విభాగంలో అధిక ఆదాయం

- Advertisement -
- Advertisement -

4.78 లక్షల టన్నుల లోడింగ్‌తో రూ. 200 కోట్ల ఆదాయం
నూతన పార్సిల్స్ విధానంతో అధిక వృద్ధి
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిశోర్

SCR earns Rs 109 cr revenue from parcel service

మనతెలంగాణ/హైదరాబాద్: పార్శిళ్ల విభాగంలో మునుపెన్నడూ లేని విధంగా దక్షిణ మధ్య రైల్వే అధిక ఆదాయాన్ని ఆర్జించింది. కరోనా సమయంలోనూ ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిశోర్ వెల్లడించారు. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టబడిన వినూత్న విధానాలతో పాటు జోన్‌లో సజావుగా నిత్యావసరాల సరఫరా జరగడానికి కేంద్రీకృత విధానాలను పటిష్టంగా అమలు చేసినట్టు ఆయన తెలిపారు. ఫలితంగా దక్షిణ మధ్య రైల్వే పార్సిల్ రంగంలో మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో అత్యధికంగా పార్సిల్ ఆదాయాన్ని ఆర్జించిందన్నారు. 2020-,21 సంవత్సరంలో పార్సిల్‌లో వార్షిక ఆదాయం మొత్తం రూ.108.3 కోట్లు కాగా కరోనా మహమ్మారి తెచ్చిన సవాళ్లను అధిగమిస్తూ పార్సిల్స్‌లో 4.78 లక్షల టన్నుల లోడింగ్‌ను నిర్వహించి రూ. 200 కోట్ల ఆదాయాన్ని సౌత్ సెంట్రల్ రైల్వేస్ సాధించిందన్నారు. భారతీయ రైల్వేలో పార్సిల్ స్పేస్ కోసం అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం ఏర్పాటు, షెడ్యూల్ ప్రకారం రైళ్లను నడపటం, స్నేహపూర్వక విధానాలతో ఇది సాధ్యమయ్యిందన్నారు. నూతన పార్సిల్స్‌ను పొందడంతో పాటు రోడ్డు ద్వారా వెళ్లే పార్సిల్స్‌ను రైలు రవాణాకు మళ్లీంచడం వంటివి పార్సిల్ రంగంలో వృద్ధికి ఊతంగా మారాయి.

సరుకు రవాణాలో 112.51 మిలియన్ టన్నుల లోడింగ్

వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, దేశ రాజధానికి పాల రవాణాలో ఈ సేవలు కీలక పాత్రను పోషించాయన్నారు. 473 కిసాన్ ప్రత్యేక రైళ్ల ద్వారా 1.57 లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేసి రూ.72.67 కోట్ల ఆదాయాన్ని పొందిందని ఆయన తెలిపారు. పాల సరఫరాతో రూ.34.03 కోట్లు, నాన్ లీజ్డ్ ట్రాఫిక్ నుంచి రూ.73.62 కోట్లు, స్పేస్ లీజింగ్ ద్వారా రూ.20.08 కోట్లు ఆర్జించినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిశోర్ వెల్లడించారు. కరోనా కారణంగా దక్షిణ మధ్య రైల్వేకు అనేక సవాళ్లు ఎదురైనా వాటిని ఇప్పుడిప్పుడే అధిగమిస్తోందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సరకు రవాణాలో మరో అత్యుత్తమమైన మైలురాయిని దాటిందన్నారు. 2021,-22 సంవత్సరంలో సరుకు రవాణాలో 112.51 మిలియన్ టన్నుల లోడింగ్ నిర్వహించిందన్నారు. దీని ద్వారా రికార్డు స్థాయిలో రూ.10,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని, అన్ని రకాల సరకుల లోడింగ్ అధిక స్థాయిలో జరగడంతో అన్ని రంగాల్లోనూ సరకు రవాణాలో వృద్ధి సాధించిందని ఆయన తెలిపారు.

సరకు రవాణాలో 17.7 శాతం అధిక ఆదాయం

గత ఆర్థిక సంవత్సరం 2020,-21తో పోలిస్తే సరకు రవాణాలో 17.7 శాతం అధిక ఆదాయాన్ని, 17.3 శాతం అధిక లోడింగ్‌ను సాధించామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిశోర్ తెలిపారు. సరకు రవాణా లోడింగ్ పురోగతిలో బొగ్గు 53.78 ఎంటిల లోడింగ్‌తో, సిమెంట్ 32.339 ఎంటి, ఆహార ధాన్యాలు 7.980 ఎంటి, ఎరువులు 5.925 ఎంటి, కంటైనర్ల సేవలు 2.137 ఎంటి, స్టీల్ ప్లాంట్ల కోసం ముడిసరకు 4.14 ఎంటి, అల్మూనియం పౌడర్, ఫ్లైయాష్, గ్రానైట్, చెక్కర మొదలైనవి 5.80 ఎంటిల లోడింగ్‌లో భాగస్వామ్యమయ్యాయని ఆయన తెలిపారు. సరకు రవాణాలో వివిధ వినూత్న పథకాలు చేపట్టడం, పలు స్టేషన్ల మార్గాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో సహా సరకు రవాణా నిర్వహణకు అనేక సౌకర్యాలను మెరుగుపర్చడం వంటి చర్యలతో ఆదాయం, లోడింగ్ వృద్ధి సాధించడానికి తోడ్పడిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News