- Advertisement -
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆచార్య’. మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే చాలా కాలం అనంతరం ఈ చిత్రం షూటింగ్ తిరిగి మొదలైంది. ఈ చిత్రానికి ఫిల్మ్మేకర్స్ ఏకంగా నాలుగు కోట్ల బడ్జెట్ తో ఒక అదిరిపోయే సెట్ను నిర్మిస్తున్నారని తెలిసింది. అది దేని కోసమో అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ చాలా రియలిస్టిక్గా ఈ సెట్ను తీర్చిదిద్దుతున్నారని తెలిసింది. ఇప్పటికే పలు దేవాలయాల సెట్స్ను మేకర్స్ నిర్మించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మెగాపవర్ స్టార్ రామ్చరణ్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
- Advertisement -