Sunday, May 12, 2024

వివాహేతర సంబంధం… భార్యపై కొడవలితో దాడి…. గొంతు కోసుకొని….

- Advertisement -
- Advertisement -

Husband attack on wife after his suicide

లూధియానా: భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆమెపై కొడవలితో దాడి చేసి అనంతరం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సంఘటన పంజాబ్‌లోని లూధియానా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అమర్బీర్ సింగ్-మన్మీత్ కౌర్ దంపతులు ఉన్నారు. మన్మీత్ కౌర్ వివాహేతర సంబంధ పెట్టుకుందని అనుమానంతో ఆమెను వేధించేవాడు. ప్రతి రోజు మద్యం తాగి వచ్చి ఆమెతో గొడవకు దిగేవాడు. దీంతో మన్మీత్ తన నాలుగేళ్ల కుమారుడితో కలిసి వేరుగా ఉంటుంది. అమర్బీర్ సింగ్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. మన్మీత్ దేవుడి దర్శనం కోసం ప్రతి రోజు ఉదయం గురుద్వార్ వెళ్లేది. గత శుక్రవారం మన్మీత్ తన మరదలుతో కలిసి గురుద్వార్‌కు వెళ్తుండగా అమర్బీర్ కొడవలితో భార్యపై దాడి చేశాడు. అనంతరం అదే కొడవలితో అతడు గొంతు కోసుకుంటుండగా స్థానికులు కొడవలిని లాక్కొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన భార్యను స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News